ఆర్ఎస్ఎస్ కార్యాలయం పై నాటు బాంబు దాడి.. తప్పిన ముప్పు

-

కేరళలోని కాన్పూర్ జిల్లా పయ్యాన్నూర్ లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యాలయం పై బాంబు దాడి జరిగింది. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి దాడి చేశారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. దాడికి గల కారణాలు తెలియరాలేదు. ప్రస్తుతం నిందితుల కోసం గాలిస్తున్నామని, ఇందులో భాగంగా సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

విచారణలో భాగంగా ఆర్ఎస్ఎస్ ఆఫీస్ ను సీజ్ చేశారు. ప్రాథమిక సమాచారం మేరకు తెల్లవారుజామున 1:30 గంటలకు ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి ఆఫీస్ పై నాటు బాంబును విసిరారు. దాడి సమయంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కొంతమంది లోన ఉన్నట్లుగా తెలుస్తోంది. భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కల నివాసితులు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. గతంలోనూ ఈ ప్రాంతంలో పెట్రోల్ బాంబులు విసిరిన సందర్భాలు ఉన్నాయి. అయితే సోమవారం ఆ ప్రాంతంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news