పసుపు తాడు పై తనకున్న ప్రేమను చూపించిన నయనతార.. నెటిజన్స్ షాక్!

-

హిందూ సంప్రదాయం ప్రకారం మంగళ సూత్రాన్ని ఆడవాళ్లు ఎంతో పవిత్రంగా భావిస్తారు .అంతే కాదు మంగళ సూత్రం భర్త యొక్క ఆయుష్ కి ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే ఆడవాళ్లు మంగళ సూత్రం విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తూనే మరెన్నో సెంటిమెంట్లను కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఇకపోతే నూతన వధూవరులకు వివాహం జరిగే సమయంలో తాళిబొట్టును పసుపు తాడుకు కట్టి వరుడు వధువు మెడలో మూడు ముళ్ళు వేస్తాడు.

ఇక వివాహమైన 9 రోజులకు లేదా 11 రోజులకు ఆ పసుపు తాడును తీసివేసి బంగారు చైన్ కు తాళి బొట్టు వేసుకుంటారు.. ఇది సాధారణ మహిళల విషయంలో జరుగుతుంది కానీ సెలబ్రిటీల విషయానికొస్తే చాలామంది సెలబ్రిటీలు వివాహమనంతరం తమ మెడలో మాంగల్యాన్ని ధరించడం చాలా అరుదనే చెప్పాలి.

ఎందుకంటే తమ పాత్రలకు అనుగుణంగా ఆడవారు మంగళసూత్రాన్ని తీసివేయాల్సి ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు చాలామంది హీరోయిన్లు వివాహం అనంతరం మంగళసూత్రాన్ని మెడలో ధరించరు. కానీ ఇటీవల నయనతార చేసిన పనికి మాత్రం సినీ సెలబ్రిటీలే కాదు నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. ఒక సెలబ్రిటీ అయ్యుండి అది కూడా వివాహం జరిగి నెల రోజులు అవుతున్నా తన మెడలోనే పసుపు తాడును ఆమె తీయకపోవడంతో ప్రతి ఒక్కరు షాక్ అవ్వడమే కాదు పసుపు తాడు పై ఆమెకున్న సెంటిమెంటును చూసి ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్.

ఇకపోతే షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ డైరెక్షన్ లో నయనతార ఒక సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈమే ముంబైలో షూటింగ్ కోసం వెళ్లగా.. అక్కడ షూట్ కి సంబంధించిన ఫోటోలను కూడా నెట్టింట్లో షేర్ చేసింది. అయితే తన మెడలో ఇంకా పసుపుతాడు అలాగే ఉండడంతో అభిమానుల సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక తన భర్త విఘ్నేష్ శివన్ కట్టిన పసుపు తాడును ఆమె ఎంతో సెంటిమెంట్ గా భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో నెటిజన్లు సైతం ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news