కరోనా మహమ్మారి అల్లకల్లోలం… ఏకంగా 180 మంది సైనికులు మృతి

-

కరోనావైరస్ మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి రోజు రోజుకూ వ్యాప్తిస్తూ యావత్ ప్రపంచం లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. తొలుత చైనా లో మొదలెత్తుకున్న ఈ కరోనా మహమ్మారి అంచలంచలుగా ప్రపంచదేశాలకు విస్తరించింది. అయితే తాజాగా చైనాలో కొత్త కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టినప్పటికీ.. యూరప్ సహా పలు దేశాల్లో మాత్రం ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే ఈ కరోనావైరస్ బారినపడి 4300 మంది చనిపోయారు. చైనా తర్వాత ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియాలో ఎక్కువ మంది చనిపోయినట్లు సమాచారం. ఐతే ఉత్తర కొరియాలో దాదాపు 200 మంది సైనికులు చనిపోయారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. అయితే ఆ దేశం మాత్రం ఈ విషయాన్నీ వెల్లడించలేదు. ఇప్పటికే కరోనా సోకింది అని తెలిసి ఆ వ్యక్తి ని కాల్చి చంపినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే గత రెండు నెలల వ్యవధి లో 180 మందికి పైగా సైనికులు చనిపోయినట్లు దక్షిణ కొరియా కు చెందిన వార్తా సంస్థ డైలీ ఎన్ కే ఒక కధనాన్ని ప్రచురించింది. ఆ కథనం ప్రకారం…ఉత్తర కొరియా లో జనవరి,ఫిబ్రవరి నెలల్లో 180 మందికి పైగా సైనికులు చనిపోగా, 3,700 మందిని క్వారంటైన్ సెంటర్ లకు తరలించినట్లు ఆ కధనంలో పేర్కొంది.

అయితే మృతి చెందిన వారిలో ఎక్కువగా చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులే ఎక్కువగా ఉన్నారని ఉత్తర కొరియా కు చెందిన మిలటరీ వైద్య అధికారి ఈ విషయాన్నీ బయటపెట్టినట్లు తన కధనంలో పేర్కొంది. అయితే ఈ విషయం పై ఉత్తర కొరియా ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ దక్షిణ కొరియా వార్తా సంస్థ ఈ కధనాన్ని ప్రచురించింది. జనవరి,ఫిబ్రవరి నెలల్లోనే ఇంతమంది చనిపోయారని,అయితే మార్చి లో కూడా మరిన్ని మరణాలు సంభవించి ఉండొచ్చు అని ఆ వార్తా సంస్థ అభిప్రాయపడింది. అయితే ఇంత ప్రాణనష్టం జరుగుతున్నా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మాత్రం ఈ విషయం బయటకు పొక్కకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. నియంతృత్వ పాలన తో వ్యవహరించి కిమ్ కరోనా విషయంలో గతంలో అధికారులకు వార్నింగ్ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏది ఎలా ఉన్నా దేశంలో కరోనా ప్రబలకుండా చూడాలి అంటూ అధికారులను ఆదేశించారు కూడా. అయినప్పటికీ అక్కడ కరోనా ప్రబలుతున్నట్లు దక్షిణ కొరియా వార్తా సంస్థ కధనాల ద్వారా స్పష్టమౌతుంది. అయితే ఇప్పటివరకు సైనికుల మృతి పై ఎలాంటి అధికారిక ప్రకటన కూడా విడుదల చేయలేదు. మరి ఈ డైలీ ఎన్ కె కధనం పై కిమ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news