విషాదాంతం: కిడ్నాప్ అయిన చిన్నారి మృతి… సొంతవాళ్ళే చంపేశారా ?

-

ఈ మధ్య సమాజంలో అనేక అన్యాయాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు డబ్బు కోసం కొన్ని చేస్తుంటే మరికొందరు పగలు ప్రతీకారాలు మరియు చిన్న చిన్న ఈగోల కోసం ప్రాణాలను తీసే వరకు వెళ్లిపోతున్నారు. ఇదిలా ఉంటే నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ లో రెండు రోజుల క్రితం ఒకటిన్నర సంవత్సరం ఉన్న పాప హారిక వారి ఇంట్లో ఉయ్యాలలో నిద్రపోతుండగా ఎవ్వరో అపహరించుకొని వెళ్లారు. ఆ రోజు నుండి తల్లితండ్రులు మరియు పోలీసులు ఆ పాప కోసం వెతకని చోటు లేదు. అయితే ఈ రోజు ఉదయం విషాద వార్త ఆ కుటుంబాన్ని దుఃఖ సాగరంలో ముంచేసింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆ పాప హారిక సర్వేపల్లి కాలువలో శవమై కనిపించింది. కానీ పోలీసులు చుట్టుపక్కల వారిని బంధువులను తగిన రీతిలో విచారణ చేయడంతో ఈ విషయం బయటపడింది.

 

ఈ రోజుల్లో రక్త సంబంధీకులే శత్రువులుగా తయారవుతున్నారు.. ఈ హారిక చావు విషయంలోనూ అదే జరిగింది అని పోలీసులు అనుమానిస్తున్నారు. రక్త సంబంధం ఉన్నవారే ఈ ఈపాపను సర్వేపల్లి కాలువలో పడేది ఉంటారని భావిస్తున్నారు. అసలు విషయం తెలియదు ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news