ఏపీలో కొత్త పార్టీ.. క్లారిటీ ఇచ్చిన బ్ర‌ద‌ర్ అనిల్

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో కొత్త పార్టీ వ‌స్తున్న‌ట్టు సోషల్ మీడియా తో పాటు ఇత‌ర మీడియాలో ఒక వార్త తెగ వైర‌ల్ అవుతుంది. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అధికార పార్టీ అయిన వైసీపీని ఢీ కొట్టేందుకు కొత్త పార్టీ వ‌స్తుంద‌ని.. దానికి వైఎస్ షర్మిల భ‌ర్త బ్ర‌ద‌ర్ అనిల్ ముఖ్య పాత్ర‌లో ఉంటార‌ని ప్రచారం సాగింది. కాగ ఈ వార్త‌ల‌పై వైఎస్ షర్మిల భ‌ర్త బ్ర‌ద‌ర్ అనిల్ క్లారిటీ ఇచ్చారు. తాను ఎలాంటి పార్టీ పెట్ట‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. తాను పార్టీ పెడ‌తాన‌ని ఎక్క‌డా చేప్ప‌లేద‌ని అన్నారు.

కొత్త పార్టీ వార్త‌.. అస‌త్య ప్ర‌చామ‌ని కొట్టి ప‌డేశారు. కాగ జ‌గ‌న్ గెలుపె కోసం ప‌ని చేసిన కొంత మంద్రి క్రైస్త‌వులు, ఎస్సీలు, బీసీలు ఆవేద‌న‌లో ఉన్నార‌ని అన్నారు. వారితో తాను స‌మావేవం అయ్యానని అన్నారు. అక్క‌డ కూడా తాను పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్ప‌లేద‌ని అన్నారు. ఈ స‌మావేశంలో వాళ్లు త‌మ స‌మ‌స్య‌ల‌ను మాత్ర‌మే చెప్పుకున్నార‌ని అన్నారు. జ‌గ‌న్ కు ఓటు వేసినందుకు బాధ ప‌డుతున్నార‌ని అన్నారు. అలాగే తాను ఉండ‌వ‌ల్లి అరుణ కుమార్ ను క‌ల‌వ‌డానికి కార‌ణం ఇది కాద‌ని అన్నారు. దీనిపై పూర్తి వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాన‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news