బ్రేకింగ్‌ : ఏపీలో మ‌రో కొత్త రెవెన్యూ డివిజ‌న్‌

-

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఇటీవల మంత్రి వర్గ విస్తరణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో నేడు తొలి సారి ఏపీ మంత్రి వర్గం సమావేశమైంది. అంతేకాకుండా ఈ సమావేశంలో పలు ఏపీ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అయితే.. ఏపీలో మ‌రో కొత్త రెవెన్యూ డివిజ‌న్‌ను ఏర్పాటు చేస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది రాష్ట్ర కేబినెట్. గుంటూరు జిల్లా ప‌రిధిలోని రేప‌ల్లె కేంద్రంగా ఏర్పాటు కానున్న ఈ డివిజ‌న్‌లో రేప‌ల్లెతో పాటు వేమూరు అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గాల ప‌రిధిలోని మండ‌లాలు కొన‌సాగ‌నున్నాయి.

Andhra gets new official state emblem, inspired by Amaravati art | The News Minute

ఈ మేర‌కు గురువారం భేటీ అయిన రాష్ట్ర మంత్రివ‌ర్గం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రేప‌ల్లెను రెవెన్యూ డివిజ‌న్‌గా ప్ర‌క‌టిస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణ‌యంపై వైసీపీ సీనియ‌ర్ నేత‌, ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉంటే… కొత్త జిల్లాల ఏర్పాటు సంద‌ర్భంగా ఆయా జిల్లాల్లో కొత్త‌గా రెవెన్యూ డివిజ‌న్ల‌ను కూడా ఏపీ ప్ర‌భుత్వం ప్రకటించింది. అప్పటికే ఉన్న రెవెన్యూ డివిజ‌న్ల‌తో కొత్త డివిజ‌న్లు క‌లిపి రాష్ట్రంలో మొత్తం 74 రెవెన్యూ డివిజ‌న్లు ఉండగా.. ఇప్పుడు కొత్త‌గా రేప‌ల్లె కూడా రెవెన్యూ డివిజ‌న్‌గా మార‌నుండ‌టంతో వాటి మొత్తం రెవెన్యూ డివిజ‌న్ల సంఖ్య 75కు చేరుకోనుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news