సుశాంత్ కేసులో నయా ట్విస్ట్.. ఆ 15 కోట్లు ఎక్కడ..?

-

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో రోజుకో కీలక విషయం వెలుగుచూస్తుంది. ఈ కేసులో రియా ప్రేమేయం ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది. నిన్న బీహార్ పోలీసులు ఆమె నివాసానికి వెళ్లగా ఆమె అక్కడ లేకపోవడం కలకలం రేపింది. దీనితో బీహార్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. సుశాంత్ తండ్రి రియాపై బీహార్‌లోని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈడీ కూడా ఈ కేసు విచారణపై దృష్టి పెట్టినట్లు సమాచారం.

రియా చక్రవర్తి సుశాంత్ ఖాతా నుంచి రూ.15 కోట్లు మాయం చేసినట్లు బీహార్ పోలీసులు గుర్తించడంతో ఈడీ ఈ కేసుపై దృష్టి సారించింది. ఆ డబ్బును రియా ఎవరికి బదిలీ చేసింది.. ఎందుకు బదిలీ చేసిందన్న విషయాలపై ఈడీ విచారణ ముందుకు సాగనున్నట్లు తెలిసింది. దీంతో సుశాంత్ సింగ్ ఆత్మహత్యలో ఎవరికీ తెలియని మరో కోణం ఉందన్న వాదన వినిపిస్తుంది. ప్పటికే బీహార్ పోలీసులు సుశాంత్ బ్యాంకు అకౌంట్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ముంబైలోని బాంద్రాలో ఉన్న కొటక్ మహీంద్రా బ్యాంకుకు వెళ్లారు. అలాగే సుశాంత్ సింగ్ లాయర్ ఈ కేసు విషయంలో ఎవరోపోలీసు అధికారి రియాకు సాయం చేస్తున్నారన్న అనుమానం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news