బాంబ్ బెదిరింపులు : పాక్ టూర్ రద్దు చేసుకు న్యూజిలాండ్

-

న్యూజిలాండ్‌ మరియు పాక్ స్థాన్‌ క్రికెట్‌ జట్ల మధ్య జరగాల్సిన టూర్‌ పూర్తి గా రద్దు అయింది. ఇవాళ పాకిస్థాన్‌ లోని రావల్పిండి స్టేడియం లో మొదటి వన్డే.. ఇవాళ రద్దు అయింది. భద్రతా సమస్యల కారణం గా ఇరు జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌ రద్దు అయింది.

అయితే… మొదటి మ్యాచ్‌ రద్దు అయినట్లు ప్రకటించిన కొద్ది సేపటి క్రితమే.. పాక్‌ స్థాన్‌ టూర్‌ ను కూడా పూర్తి గా రద్దు చేసుకుంటున్నట్లు… న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు స్పష్ఠం చేసింది. భద్రతా సమస్యల నేపథ్యం లో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు.

ఇక భద్రతా బలగాల సూచనల మేరకు హోటల్‌ గదుల్లోనే ఉండి పోయారు ఇరు జట్ల క్రికెటర్‌ళు. కాగా.. సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 3 వరకు రావల్పిండి మరియు లాహోర్‌ లో పాక్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ జరగాల్సి ఉందన్న సంగతి తెలిసిందే. .

Read more RELATED
Recommended to you

Latest news