Big Boss OTT Telugu: ఆసక్తికరంగా ‘బిగ్ బాస్’..మిత్రా శర్మ కొనసాగింపుపై అనుమానాలు!

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ఓటీటీ నాన్ స్టాప్ మోడ్ లో వెరీ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. కంటెస్టెంట్స్ ఏడో వారంలో చాలా తెలివిగా గేమ్ ఆడుతున్నారు. ఈ షోను తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ లో స్ట్రీమ్ అవుతున్న ఈ షో కు రేటింగ్స్ కూడా బాగానే వస్తున్నాయి.

హోస్ట్ గా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, ఈ షో నుంచి ఎలిమినేట్ అవుతున్న కంటెస్టెంట్స్ గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతున్నది. వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ను కూడా ‘బిగ్ బాస్’ నిర్వాహకులు కావాలనే ఎలిమినేట్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ గా మిత్రా శర్మ కొనసాగింపు వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెకండ్ లేదా థర్డ్ వీక్ లోనే ఈమె ఎలిమినేట్ అవుతుందనునకున్నారు. కానీ, ఇంకా కొనసా..గుతోంది. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న న్యూస్ ప్రకారం..మిత్రా శర్మ రెమ్యునరేషన్ లేకుండానే హౌజ్ లో కొనసాగుతుందని అంటున్నారు.

హౌజ్ లోకి వెళ్లే ముందర పీఆర్ టీమ్ లను ఏర్పాటు చేసుకుని వెళ్లిందని ఆరోపణలు వస్తున్నాయి. ధనవంతురాలైన మిత్రా శర్మ ఆటలో నెగ్గడం కోసం డబ్బులు బాగానే ఖర్చు పెట్టుకుంటుందని కొందరు విమర్శలు చేస్తున్నారు. తనకు రూ.5 లక్షలు ఊరికెనె ఇస్తానని శ్రవంతి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అలా మిత్రా శర్మ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కొనసాగడం వెనుక ఆసక్తికర చర్చ అయితే జరుగుతున్నది.

Read more RELATED
Recommended to you

Latest news