పీఎఫ్‌ఐ కేసులో హైదరాబాద్​​లో మరోసారి ఎన్ఐఏ సోదాలు

-

పీపుల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో ఎన్ఐఏ దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి హైదరాబాద్, కరీంనగర్ జిల్లాల్లో సోదాలు చేస్తోంది. హైదరాబాద్ నగరంలోని చాంద్రాయణగుట్ట పీఎఫ్ఐ కార్యాలయం.. ఎల్బీనగర్, ఆటోనగర్‌లోని ఓ ఇంట్లో అధికారులు తనిఖీలు చేశారు. చాంద్రాయణగుట్టలోని పీఎఫ్​ఐ కార్యాలయాన్ని సీజ్ చేశారు. మరోవైపు కరీంనగర్‌లోని పలు ప్రాంతాల్లోనూ ఎన్‌ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. పీఎఫ్‌ఐ మాజీ కార్యకర్త కోసం ఆరా తీసిన ఎన్‌ఐఏ అధికారులు.. పరారీలో ఉన్న కార్యకర్త కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

మరోవైపు.. దేశవ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకలాపాలపై ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఉత్తర్​ప్రదేశ్, కేరళ సహా దేశవ్యాప్తంగా సోదాలు జరుగుతున్నాయి. పీఎఫ్ఐకి చెందిన కీలక వ్యక్తుల నివాసాల్లో దాడులు చేసి.. దేశవ్యాప్తంగా 100 మందిని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. పీఎఫ్ఐ ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించి నిధులు సమకూరుస్తోందన్న అనుమానంతో దేశంలోని 40 ప్రాంతాల్లో ఎన్ఐఏ, ఈడీ అధికారులు సంయుక్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news