21 ఏళ్ల తర్వాత నా కల నెరవేరింది: సంజూ

-

సూపర్ స్టార్ రజనీకాంత్ ను క్రికెటర్ సంజు శాంసన్ ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా సంజును తలైవా శాలువాతో సత్కరించారు. ఈ ఆనందాన్ని సంజు ట్విట్టర్ లో పంచుకున్నారు.

‘నేను ఏడేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి రజినీకాంత్ కు అభిమానిని. ఏదో ఒక రోజు రజినీని ఆయన ఇంట్లోనే కలుస్తానని అప్పట్లో మా పేరెంట్స్ కు చెప్పాను. 21 ఏళ్ల తర్వాత ఆ రోజు వచ్చింది. తలైవా నన్ను ఆయన ఇంటికి ఆహ్వానించారు’ అని పేర్కొన్నారు.

ఇది ఇలా ఉండగా, రాజకీయాల్లోకి ఎందుకు రాలేదనే విషయం పై క్లారిటీ ఇచ్చారు సూపర్ స్టార్ రజనీకాంత్. పొలిటికల్‌ ఎంట్రీ రెడి అయినా సమయంలో కరోనా వచ్చిందని.. రాజకీయాల్లో రావాలనే ప్లాన్ లో ఉన్నప్పుడు డాక్టర్లు కీలమైన సూచనలు చేశారని వెల్లడించారు. ప్రజలను కలిసే సమయం లో పది అడుగుల దూరం ఉండాలి, మాస్క్‌ వేసుకోవాలని అన్నారని రజినీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news