మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌.. ఫైనల్​కు నిఖత్​, నీతూ, లవ్లీనా, స్వీటీ

-

మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌-2023లో భారత్ అమ్మాయిల పంచ్ అదిరింది. భారత్​కు మరో రెండు సిల్వర్​ మెడల్స్​ ఖాయమయ్యాయి. ఈ మెగాటోర్నీలో డిఫెండింగ్ ఛాంప్​గా బరిలోకి దిగిన భారత స్టార్‌ బాక్సర్‌, తెలంగాణ పిల్ల నిఖత్‌ జరీన్‌ తన పర్ఫామెన్స్ తో అదరగొడుతోంది. రింగ్‌లో పవర్​ఫుల్​ పంచ్‌లతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. మహిళల 50 కేజీల విభాగంలో పోటీపడుతున్న నిఖత్‌.. ఇప్పటికే సెమీ ఫైనల్​ చేరుకుని పతకాన్ని ఖాయం చేసుకుంది.

అయితే గురువారం రోజున కూడా సెమీఫైనల్‌ బౌట్‌లో కూడా తన పవర్​ పంచ్​ను చూపించింది. బలమైన పంచ్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. కొలంబియన్‌ బాక్సర్‌ ఇంగ్రిట్​ లొరెనా వాలెన్సియా విక్టోరియాపై 5-0 తేడాతో అద్భుత విజయం సాధించింది. తద్వారా ఫైనల్‌​కు అర్హత సాధించింది. ఇక ఈ ఫైనల్​లో విజయం సాధిస్తే స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంటుంది. ఈ ఛాంపియన్‌షిప్ లో నీతు గాంగాస్‌ (48 కేజీ), లవ్లీనా (75 కేజీ), స్వీటీ బూర (81 కేజీ) కూడా ఫైనల్స్‌లో అడుగుపెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news