అతి తీవ్రత నుంచి తీవ్ర స్థాయికి ‘నివర్’

-

అతి తీవ్రత నుంచి నివర్‌ తుఫాను తీవ్రత క్రమంగా తగ్గుతోంది. తీరం దాటిన తర్వాత జోరు తగ్గింది. తీవ్ర తుఫానుగా మారింది. పుదుచ్చేరి సమీపంలో బుధవారం రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 2.30 గంటల మధ్యలో ‘నివర్’ తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం దాటే సమయంలో 120 నుంచి 145 కి.మీ వేగంతో పెనుగాలులు వీశాయి. తర్వాత కూడా కొద్ది గంటలపాటు ప్రభావం కొనసాగింది. బుధవారం నుంచే పుదుచ్చేరి, తమిళనాడు తీర ప్రాంతాల్లో పెనుగాలులు, అతిభారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. గాలులకు భారీ చెట్లు కూడా నేలకొరిగాయి. చెన్నై, చెంగల్‌పట్టు, కడలూరుతోపాటు పుదుచ్చేరిలో నిన్న భారీ వర్షాలు కురిశాయి. చెన్నైలో బుధవారం 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పుదుచ్చేరిలో 10 సెంటీమీటర్లు కురిసింది. దీంతో తమిళనాడులోని 16 జిల్లాల్లో ప్రభుత్వం నేడు సెలవు దినంగా ప్రకటించింది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

nivar
nivar

తమిళనాడులో ముందు జాగ్రత్తగా నాగపట్నం, విల్లుపురం, కడలూరు జిల్లాలతో పాటు మరిన్ని ప్రాంతాల నుంచి 1.45 లక్షల మందిని 1500 పైగా పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి తరలించారు. ఏపీలో నెల్లూరు జిల్లాలో భారీ వర్షం కురిసింది. చిత్తూరులోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అనేక చోట్ల విద్యుత్‌ స్తంభాలు కూడా పడిపోయాయి. విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

గాలివానకు ఒక్కసారిగా చెట్టు కూలి ఒక వ్యక్తి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. 1200 వందల బృందాలు తమిళనాడు, పుదుచ్చేరిలోని తీర ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఒడిశాలో మరో 20 బృందాలను సిద్ధంగా ఉంచారు. నౌకాదళం కూడా సహాయక చర్యల్లో పాల్గొంటోందని అధికారులు తెలిపారు. ప్రజలు ఇళ్లలోనే ఉంటూ అప్రమత్తంగా ఉండాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఎలాంటి ప్రమాదం సంభవించినా తక్షణమే అధికారులకు సంప్రదించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news