ప్రభాస్: ఆదిపురుష్ క్వాలిటీ విషయంలో తగ్గేదిలే..!!

-

ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమా ”ఆదిపురుష్” వచ్చే సంక్రాంతి బరి నుండి  తొలిగి పోయింది. తాజాగా వచ్చే ఏడాది వేసవిలో జూన్ 16న ‘ఆదిపురుష్’ను విడుదల చేయనున్నట్టు ఓం రౌత్  ప్రకటన విడుదల చేశారు. దీనితో ప్రభాస్ అభిమానులు అందరూ నిరుస్తాహం చెందారు.ఈ కథ మన రామాయణంను స్ఫూర్తిగా తీసుకొని తీసిన సినిమా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాని సోషల్ మీడియాలో వార్తలు వచ్చినట్లే సినిమా వాయిదా పడింది.

గతంలో ఆదిపురుష్ కోసం రిలీజ్ చేసిన టీజర్ లో గ్రాఫిక్స్ బాగా లేవని సోషల్ మీడియాలో ట్రోల్ చేసారు. అదే సమయంలో మరి కొంత మంది  హిందూ దేవుళ్లను కించ పరిచేలా టీజర్ వుందని కూడా కామెంట్స్ చేసారు.దీనితో ఆదిపురుష్ టీజర్‌కు వస్తోన్న నెగిటివ్ కామెంట్స్ పై దర్శకుడు ఓం రౌత్ ఈ  సినిమాపై తాను పూర్తి నమ్మకంతో ఉన్నట్లు తెలిపాడు. కాని ఈ సినిమా కంటెంట్, క్వాలిటీ విషయంలో చాలా మందికి నమ్మకం లేకపోవడంతో డైరెక్టర్ పై క్వాలిటీ కోసం వత్తిడి తెచ్చారు.

అదే సమయంలో ఓం కమ్ టూ మై రూమ్ అని ప్రభాస్ అనడం వైరల్ గా మారింది. దీనితో దర్శకుడు ఓం రౌత్ బడ్జెట్ ఎక్కువ అయినా కూడా వెరవకుండా VFX వారితో క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా కుండా చూడాలని కోరాడు. దీనితో వారు క్వాలిటీగా రావాలంటే టైమ్ పడుతుంది అని చెప్పడంతో, తాను ప్రభాస్ మరియు నిర్మాత లతో చర్చలు జరిపి సినిమాను జూన్ 16 కు వాయిదా వేశారు. లేట్ అయినా కూడా క్వాలిటీ తో వచ్చి హిట్ కొట్టాలని ప్రభాస్ ఆశిస్తున్నాడట.

 

Read more RELATED
Recommended to you

Latest news