సజ్జల మాటలు ఎవరూ నమ్మరు – వి హనుమంతరావు

-

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిసే పరిస్థితి వస్తే స్వాగతిస్తామంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. సజ్జన ఆలోచనలో మార్పు రావడం లేదన్నారు. ఇన్నాళ్లు అన్యాయం జరిగింది కాబట్టే తెలంగాణ వచ్చిందని.. మళ్లీ కలిసేది అసంభవం అన్నారు. పొలిటికల్ మైలేజ్ కోసమే సజ్జల మాట్లాడుతున్నారని అన్నారు విహెచ్.

సజ్జల మాటలు ఎవరూ నమ్మరని అన్నారు. తెలంగాణ – ఆంధ్ర ప్రదేశ్ కలిసే పని కాదన్నారు. పొలిటికల్ మైలేజ్ కోసం లేనిపోని వాదనలు చేయొద్దన్నారు వి హనుమంతరావు. మీ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తా అన్నారు కదా దాని కోసం ప్రయత్నం చేయండి అని సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీకి మీ జగన్ దగ్గర కదా.. స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడాలని సలహా ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news