తెలంగాణలోని థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవు : తలసాని

-

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలోని సినిమా థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రకటన చేశారు. అఖండ, పుష్ప చిత్రాలతో సినీ పరిశ్రమ పుంజుకుందని.. తెలంగాణలో టికెట్ ధరలు పెంచాం, ఐదో ఆటకు అనుమతి ఇచ్చామన్నారు తలసాని. ఏపీలో థియేటర్ల సమస్యపై నేను ఆ రాష్ట్ర మంత్రులతో మాట్లాడుతానని వెల్లడించారు తలసాని.

తెలంగాణ రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్

సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని.. సినీ పరిశ్రమకు హైదరాబాద్ హబ్ గా ఉండాలన్నది ముఖ్యమంత్రి ఆకాంక్ష అని తెలిపారు. సినిమాకు కులం మతం ప్రాంతాలు ఉండవని.. సినిమా ప్రజలకు వినోదాన్ని అందించే సాధనమేనని స్పష్టం చేశారు తలసాని. సినీ పరిశ్రమలోని సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం సత్వరమే స్పందిస్తుందని.. హైదరాబాద్ లో సినీ పరిశ్రమపై ఆధారపడి వేలాది మంది జీవిస్తున్నారన్నారు. తెలంగాణలో ప్రభుత్వం సినీ పరిశ్రమపై బలవంతంగా నిర్ణయాలు తీసుకోదని.. సందర్భాన్ని బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news