ట్రంప్ కు మిడిల్ ఫింగర్ చూపించిందని భారీగా ఓట్లు వేసి ఆమెను గెలిపించిన భారతీయులు…!

-

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విషయంలో ఏం జరిగినా సరే ప్రపంచం ఆసక్తిగా గమనిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నికైన అమెరికా అధ్యక్షుల తీరు ఒకరకంగా ఉంటే ట్రంప్ వ్యవహారశైలి పూర్తి భిన్నంగా ఉంటుంది. గ్రేట్ అమెరికా మేక్ అగైన్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ఆయన అక్కడి ప్రజల్లో మాత్రం విలన్ అయ్యారు. అయన తీసుకునే నిర్ణయాల దెబ్బకు ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉంటుంది. అది పక్కన పెడితే ఆయన్ను అమెరికా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటారు. ఆ వ్యతిరేకతను కూడా బహిరంగంగానే తెలుపుతూ ఉంటారు.

ఇదిలా ఉంటే 2017లో వర్జీనియా రాష్ట్రానికి చెందిన జూలీ బ్రిస్క్‌మెన్ అనే మహిళ ట్రంప్ కాన్వాయ్ పక్కనుంచి వెళుతుంటే.. సైకిల్‌‌పై వెళ్తున్న జూలీ ట్రంప్ కాన్వాయ్‌వైపు మిడిల్ ఫింగర్ చూపిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించిన ఫోటో అప్పట్లో నెట్ లో ఒక ఊపు ఊపేసింది. ఆ ఫోటో అప్పుడు వైరల్ కావడంతో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న ఆమెను ఉద్యోగం నుంచి సంస్థ తొలగించింది. అప్పటి నుంచి కాళీగా ఉంటున్న ఆమె… డెమొక్రాట్స్ పార్టీ తరఫున లూబర్న్ కౌంటీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి దిగింది.

ఈ ఎన్నికల్లో ఆమె రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిపై భారీగా విజయం సాధించింది. తనను ప్రజలు గెలిపిస్తే తాను ఏం చేస్తాను అనే విషయాన్నీ సూటిగా సుత్తి లేకుండా ప్రజలకు వివరించింది. అందుకే ఆమె విజయం సాధించింది… అయితే ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండే భారతీయులు ఆమెకు భారీగా ఓట్లు వేసారట. దీనికి ప్రధాన కారణం ట్రంప్ నిర్ణయం తో విసిగిపోయిన భారతీయులు ఆయనకు ఆమె మిడిల్ ఫింగర్ చూపించిందని, తమ మనసులో ట్రంప్ మీద ఉన్న అభిప్రాయం కూడా అదేనని వ్యాఖ్యానిస్తూ కృతజ్ఞతగా ఆమెకు ఓట్లు వేసి గెలిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news