నందమూరి అభిరామ్ ఫోటో షేర్ చేసిన ఎన్టీఆర్..

-

నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంతోమంది తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇందులో కొంత మంది మాత్రమే చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఇందులో బాలకృష్ణ, హరికృష్ణ అలాగే జూనియర్ ఎన్టీఆర్ బాగా పాపులర్ అయ్యారు. సీనియర్ ఎన్టీ రామారావు పేరు పెట్టుకోవడం అలాగే అచ్చం అలాగే ఉండటం ఎన్టీఆర్కు కలిసొచ్చింది. దీంతో నందమూరి ఫ్యామిలీ లో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రమే మంచి ఫాలోయింగ్ ఉంది.

ఇది ఇలా ఉండగా తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్టర్ను షేర్ చేశాడు. తన కొడుకు అభిరాం తో సాన్నిహిత్యంగా ఉన్న అరుదైన ఓ ఫోటోను… షేర్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్. దీంతో క్షణాల్లో ఈ ఫోటో వైరల్ అయింది. ఈ ఫోటోలో జూనియర్ ఎన్టీఆర్ తన కొడుకు కిస్ ఇస్తూ కనిపించాడు. అలాగే ఈ పిక్చర్ లో ఈఫిల్ టవర్ మనకు కనిపించింది. అంటే ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యామిలీ ప్యారిస్ లో ఉందని తెలుస్తోంది.  ఇక ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాగా చంద్రబాబు కంటతడి ఘటనపై నిన్న జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news