ఎన్టీఆర్ కోసం పొలిటికల్‌ సబ్జెక్ట్‌ రెడీ చేస్తున్న స్టార్ డైరెక్టర్

-

త్రివిక్రమ్ శ్రీనివాస్, జూ.ఎన్టీఆర్‌ సినిమా గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అదిగో తోక అంటే ఇదిగో పులి అన్నట్లు చాలా డేట్స్ వినిపించాయి. అయితే ఇప్పటివరకు ప్రచారంలో ఉన్నవన్ని తప్పు, ఇప్పుడు కొత్త డేట్ ఫిక్స్ అయ్యిందనే టాక్ వస్తోంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్‌, జూ.ఎన్టీఆర్ సినిమా ఓపెనింగ్‌కి డేట్ ఫిక్స్ అయ్యిందని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. మార్చిలో ఈ మూవీ సెట్స్‌కి వెళ్తుందనే టాక్ కూడా వచ్చింది. అయితే ఇప్పుడీ సినిమా మార్పి నుంచి మేకి వెళ్తోందని చెప్తున్నారు. జూ.ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా మే 20న ఈ సినిమా స్టార్ట్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది.

త్రివిక్రమ్, జూ.ఎన్టీఆర్ సినిమా లాస్ట్‌ ఇయరే స్టార్ట్ కావాల్సింది. కానీ కరోనా లాక్‌డౌన్‌తో ‘ట్రిపుల్ ఆర్’ షూటింగ్‌కి బ్రేకులు పడ్డాయి. దీంతో త్రివిక్రమ్ సినిమా 2021కి పోస్ట్ పోన్ అయ్యింది. అయితే ఇప్పుడు ‘ట్రిపుల్‌ ఆర్’ని దసరా పండగకి అక్టోబర్ 13న రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేశాడు. దీంతో తారక్‌ సినిమాకి షెడ్యూల్స్‌ ప్రిపేర్ చేస్తున్నాడట త్రివిక్రమ్.

త్రివిక్రమ్, జూ.ఎన్టీఆర్ ఇంతకుముందు ఫ్యాక్షన్‌ని అరికట్టాలని ‘అరవింద సమేత’ తీశారు. ఇప్పుడు రాజకీయ ప్రక్షాళన జరగాలని పొలిటికల్‌ సబ్జెక్ట్‌ రెడీ చేస్తున్నారట. ఈ మూవీలో బాలీవుడ్‌ సునీల్‌ దత్, కన్నడ స్టార్ ఉపేంద్ర కీరోల్స్‌ ప్లే చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news