తల లేని శవం ఎవరిదో కనిపెట్టు…50 వేలు పట్టు !

-

కొన్ని చిక్కుముడుల లాంటి కేసులను సాల్వ్ చేయడానికి పోలీసులు ఎక్కువగా ఇన్ఫార్మర్లను వాడుకుంటూ ఉంటారు.. వారి వల్ల కూడా కాని పనులను రివార్డులు ప్రకటించి ప్రజలు చేతనే సాల్వ్ చేయించడానికి చూస్తూ ఉంటారు. తాజాగా అలాంటి ఒక కేసు గురించి ఒడిస్సా పోలీసులు కీలక ప్రకటన చేశారు. నిన్న భువనేశ్వర్ కటక్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దొరికిన ఒక తల లేని మహిళ మొండెం ఎవరిదో కనుగొని చెప్పిన వారికి 50000 క్యాష్ రివార్డ్ అందజేస్తామని వారు పేర్కొన్నారు.

అనుమానాస్పద స్థితిలో కనుగొనబడ్డ ఆ శరీరానికి సంబంధించి పూర్తి వివరాలను పోస్టర్ లు వేసి సిటీ ఎంత అంటించారు. ఈనెల 4వ తేదీన దొరికిన ఈ శవం యొక్క ఫోటో కూడా పోస్టర్ లో ముద్రించారు. ఆ శవానికి కుడి చేతి మీద ఉన్న టాటూ తో సహా పోలీసులు ఆ పోస్టర్లలో ముద్రించారు. ఇక ఈ శవానికి పోస్టుమార్టం నిర్వహించగా ఈ మహిళ చనిపోయాకనే మొండెం నుంచి తలను వేరు చేశారని గుర్తించారు. ఒకవేళ ఎవరైనా సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని కూడా పోలీసులు ప్రకటనలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news