సెప్టెంబర్ 17 వేడుకలకు అమిత్ షా వస్తారు – కిషన్ రెడ్డి

-

సెప్టెంబర్ 17న అమిత్ షా హైదరాబాద్ లో అధికారికంగా విమోచన వేడుకల్లో పాల్గొంటారని ప్రకటించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. పల్లెల్లో పోరాటాల స్ఫూర్తిగా నిర్మించిన బురుజులను అలంకరించి జాతీయ జెండాలను ఎగురవేయాలని పిలుపు నిచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్17 ని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

గత పాలకులు సెప్టెంబర్17 ప్రాముఖ్యత తెలియకుండా మరుగున పడేశారని ఆగ్రహించారు. బిజేపీ నేతలపై కేసులు పెట్టారు తప్పా… హైదరాబాద్ విముక్తి ఉత్సవాలను ఏ ప్రభుత్వం నిర్వహించలేదని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. ప్రజా కార్యక్రమంగా సెప్టెంబర్17న తెలంగాణ విమోచన దినోత్సవం అని తెలిపారు. నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన యోధులను స్మరించుకొని వారి కుటుంబాలను కలిసి సన్మానం చేస్తున్నామని వివరించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news