వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ కి మరోసారి నోటీసులు

-

తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన దివంగత మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ కోసం వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సిబిఐ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. ఈ నోటీసులపై స్పందించిన అవినాష్ రెడ్డి కేసు విషయంలో దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని.. కానీ ఇప్పుడు విచారణకు హాజరు కాలేనని సిబిఐకి లేఖ రాశారు.

పులివెందులలో బిజీ షెడ్యూల్ ఉన్నందున విచారణకు రాలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. ఐదు రోజుల తర్వాత సిబిఐ ఎప్పుడు పిలిచిన హాజరవుతానని లేఖలో పేర్కొన్నారు. అవినాష్ రెడ్డి లేఖకు స్పందించిన సిబిఐ నేడు మరోసారి ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈనెల 28వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని సిబిఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులలో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news