పేకాట వ్యవహారంలో మరో వైసీపీ ఎమ్మెల్యే ?

-

ఇప్పటికే పేకాట వ్యవహారంలో గుంటూర్ జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే అభాసు పాలయిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె పలు మార్లు చెప్పుకొచ్చింది కూడా. అయితే అందుతున్న సమాచారం మేరకు మరో ఎమ్మెల్యే ఇలాంటి వివాదంలో చిక్కున్నారు. జగ్గయ్యపేటలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు.

వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ప్రధాన అనుచరుడు సూరిబాబు ఇంట్లో పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు. జూదం శిబిరాన్ని వైసీపీ నాయకురాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు ఆకస్మిక దాడి చేసి 8 మంది జూదరులను అరెస్ట్, 8 సెల్ ఫోన్లు, రూ.లక్షా 43 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. దీని మీద కేస్ నమోదు చేసిన పోలీసులు  దర్యాప్తు చేస్తోన్నారు. ఇక ఈ అంశం మీద ఎమ్మెల్యే ఏమని స్పందిస్తారో వేచి చూడాలి. 

Read more RELATED
Recommended to you

Latest news