కరోనా ఎఫెక్ట్: వైద్యం కూడా ఆన్ లైన్లోనే.. ఎంత శాతం పెరిగిందో తెలుసా..?

-

కరోనా కారణంగా ఇంట్లో నుండి బయటకి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. తొమ్మిది నెలలుగా ఇబ్బంది పెడుతున్న వైరస్ ప్రభావం ఇప్పుడిప్పుడే కొద్దిగా తగ్గుతుంది. ఐతే ఇలా తగ్గుతుందని అనుకునేలోపే కరోనా కొత్త రూపం అంటూ మళ్లీ వచ్చింది. ఆ కొత్తరూపం ఇండియాకి వచ్చిందో లేదో తెలియదు గానీ, కరోనా వల్ల పనులన్నీ ఇంట్లోనే జరిగిపోతున్నాయి. సాధారణ సమయంలో ఏదైనా పని చేసుకోవడానికి బయటకి వెళ్లే వాళ్ళు కూడా ఆ పని ఇంట్లోనే కూర్చుండి ఎలా చేసుకోవచ్చో తెలుసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో వైద్యం కూడా ఇంట్లోనే జరిగిపోతుంది. ప్రస్తుతం చాలామంది డాక్టరుని సంప్రదించాల్సి వస్తే హాస్పిటల్ వెళ్ళడం తగ్గించేసారు. ముఖ్యంగా యాభైకి పైబడ్డ వయసుగల వారు ఈ విషయంలో కఠినంగా ఉంటున్నారట. ఈ ఏడాది దాదాపుగా 502శాతం పెరిగిందట. వృద్ధులకి కరోనా వైరస్ చాలా తొందరగా వ్యాపిస్తుందని వార్తలు వస్తున్నందున హాస్పిటల్ కి బయటకి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఐతే ముందు ముందు రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news