బీఆర్ఎస్ పనైపోయిందన్న విషయం అప్పుడే తెలిసింది : కడియం శ్రీహరి

-

టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మారడం నాకు నచ్చలేదని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ఆదివారం ఓ మీడియాతో మాట్లాడుతూ..టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మారినప్పుడే పార్టీ ఓటమి ఖరారైందనీ అన్నారు. దీనిపైనా, పార్టీ నిర్మాణంపైనా అంతర్గత సమావేశాల్లో మాట్లాడినట్లు కడియం శ్రీహరి వెల్లడించారు.అసలు తాను గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్నానని.. కానీ, మీరే చేయాలని నాపై ఒత్తిడి చేశారు అని ,తప్పని పరిస్థితుల్లో పోటీ చేయాల్సి వచ్చింది ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. నా మీదున్న నమ్మకంతో ఘన్‌పూర్ ప్రజలు గెలిపించారని ఆయన వెల్లడించారు.

అంతేకాదు.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కావ్యను నిలబెట్టాలని బీఆర్ఎస్ పెద్దలు ఆలోచిస్తున్నప్పుడు కూడా వద్దని చెప్పాను.. కావ్యను అధికారికంగా ప్రకటించిన రోజు నుంచి రాజీనామా చేసేంతవరకు ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు అని ఆయన పేర్కొన్నారు. తనకు అప్పుడే అర్ధమైంది. బీఆర్ఎస్ గెలుస్తుందన్న నమ్మకం ఎవరిలోనూ లేదు అని, ఆ పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి ఆహ్వానం వచ్చింది.. అందుకే చేరానని కడియం శ్రీహరి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news