హమ్మయ్య: ఊటీలో పట్టాలు తప్పిన హిల్ ట్రైన్… తృటిలో తప్పిన ఘోరప్రమాదం.. !

-

ఇటీవల ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లాలో ఘోరమైన రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం వలన దేశమంతా గజగజ వణికిపోయింది. ప్రపంచంలోనే ఇంత పెద్ద స్థాయిలో జరిగిన రైలు ప్రమాదాలు లేవని అధికారులు సైతం ప్రకటించారు. ఈ ప్రమాదం తర్వాత వరుసగా కొన్ని చోట్ల చిన్న చిన్న ప్రమాదాలు జరుగగా… తాజాగా తమిళనాడులోనే ఊటీలో మరో ప్రమాదం తృటిలో తప్పింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఊటీలో హిల్ ట్రైన్ పట్టాలు తప్పిందట. షెడ్యూల్ ప్రకారం హిల్ ట్రైన్ కూనూరు స్టేషన్ నుండి మెట్టుపాళయం స్టేషన్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం తప్పింది. మాములుగా అక్కడక్కడా ట్రైన్ లు ట్రాక్ రూట్ లు మార్చుకుంటూ వెళుతూ ఉంటాయి. అదే విధంగా ఈ ట్రైన్ కూడా ట్రక్క్ మార్చుకుని వెళ్తున్న క్రమంలో ఒక్కసారి చిన్న కుదుపుకు గురయింది.

దీనితో ట్రైన్ లో ఉన్న ప్రయాణికులు ఆందోనళకు గురయ్యారు. దీనితో వెంటనే ట్రైన్ ను నిలిపేసిన డ్రైవర్ రిపేర్ చేయడానికి ఆపేశారు. సంతోషకరమై విషయం ఏమిటంటే ఈ ఘటనలో ఎవ్వరికీ ఎటువంటి గాయాలు లేవు.

Read more RELATED
Recommended to you

Latest news