Jai bheem movie : జై భీమ్ కు ఆస్కార్….సాయంత్రం ప్రకటన….!

-

సినిమా రంగంలో అత్యున్నత పురస్కారం ఆస్కార్ కు ఈ ఏడాది భారతదేశం నుండి రెండు సినిమాలు షార్ట్ లిస్ట్ అయిన సంగతి తెలిసిందే. వాటిలో మలయాళ హీరో మోహన్ లాల్ నటించిన మరక్కార్ ఒకటి కాగా మరో సినిమా జై భీమ్. మొత్తం ఆస్కార్ బరిలో రెండు 276 చిత్రాలు ఉన్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో రెండు భారతీయ సినిమాలు కూడా ఉండడం గర్వకారణం.

ఇదిలా ఉంటే ఈరోజు సాయంత్రం ఆస్కార్ నామినేషన్స్ ను ప్రకటించనున్నారు. అయితే ఇందులో జై భీమ్ సినిమాకు దాదాపు ఆస్కార్ రావడం ఖరారైనట్టు కనిపిస్తోంది. ఆస్కార్ హోస్ట్ జాక్వెలిన్ ట్విట్టర్ లో జై భీమ్ ను పొగుడుతూ ఓ ట్వీట్ చేశారు… నన్ను నమ్మండి జై భీమ్ బెస్ట్ సినిమా అంటూ జాక్వలిన్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఓ నెటిజన్ మీ అంచనా ప్రకారం ఏ సినిమా ఆస్కార్ నామినేషన్ లో ఉంటుంది అని ప్రశ్నించగా… ఆమె సమాధానం ఇచ్చారు.

 

ఇక ఈ రోజు సాయంత్రం 6:48 నిమిషాలకు అధికారికంగా ప్రకటన రానుంది. ఇదిలాఉండగా జై భీమ్ సినిమాలో సూర్య హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి టి జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను సూర్య సతీమణి జ్యోతిక నిర్మించారు. అంతేకాకుండా ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, మణికందన్, లిజోమోల్ జోస్, రజిష విజయన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. చంద్రు అనే న్యాయవాది నిజ జీవిత కథ ఆధారంగా సినిమాను తెరకెక్కించారు.

 

గిరిజనుల కోసం చంద్రు చేసిన పోరాటాన్ని సినిమాలో చూపించారు. ఇక వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య జీవించారు. ఈ సినిమాలో సినతల్లి తో పాటు ప్రతి ఒక్కరి నటన ఆకట్టుకునే విధంగా ఉంది. ఇప్పటికే ఈ చిత్రం ఆస్కార్ యూట్యూబ్ ఛానల్ లో కూడా ప్రసారం చేయబడింది. నేడు ప్రకటన ఉన్న నేపథ్యంలో సూర్య అభిమానులు యావత్ భారత దేశ సినీ ప్రేమికులు ఈ సినిమా ఖచ్చితంగా ఆస్కార్ తీసుకు రావాలని కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news