సొంతపార్టీ నేతలే నాపై దుష్ప్రచారం చేస్తున్నారు – ఎమ్మెల్యే రాజయ్య

-

తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను ఖండించారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. శుక్రవారం తెలంగాణ భవన్ కు వచ్చారు ఎమ్మెల్యే రాజయ్య. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది రాజకీయ కుట్రలో భాగమేనని అన్నారు. సొంత పార్టీ నేతలే తనపై దూషి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. త్వరలోనే అన్ని నిజాలు బయటకి వస్తాయని పేర్కొన్నారు రాజయ్య.

సీఎం కేసీఆర్ ను కలిసి అన్ని విషయాలను వివరిస్తానని తెలిపారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తనపై కావాలనే అబాండాలు వేస్తున్నారని.. ఇంటి దొంగలే ఈ పని చేస్తున్నారని అన్నారు. ఇంటి దొంగలే శిఖండి పాత్ర పోషిస్తున్నారని, తనని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సమయం వచ్చినప్పుడు ముఖ్యమంత్రిని కలిసి అన్ని విషయాలు వివరిస్తానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news