అనంతపురం మహిళా రైతుతో మోడీ మాటా మంతీ…!

-

పి.యం. కిసాన్ (ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి)2021 – 22 పథకం కింద నిధులు విడుదల చేసే కార్యక్రమంలో అనంతపురం జిల్లా మహిళా రైతు వన్నూరమ్మ తో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. మహిళా రైతు వన్నూరమ్మను, అనంతపురం జిల్లాను మోడీ అభినందించారు. దేశం మొత్తంలో 5,6 మందితో మాట్లాడితే అందులో అనంతపురం జిల్లా మహిళా రైతు వన్నూరమ్మను ప్రధానమంత్రి కార్యాలయం ఎంపిక చేసింది.

ప్రకృతి వ్యవసాయంలో దేశానికి అనంతపురం ఆదర్శం వన్నూరమ్మ లాంటి మహిళా రైతులు అని మోడీ కొనియాడారు. ఒంటరి దళిత మహిళ ప్రకృతి వ్యవసాయం చేసి పెట్టుబడి మీద నికరం నాలుగు రెట్లు ఆదాయం సంపాదిస్తోంది అని ఆయన తెలిపారు. అందరూ ఇలాంటి పద్ధతులనే అనుసరిస్తే రాష్ట్రం, దేశం మొత్తం సస్యశ్యామలం అవుతుంది అని సూచించారు మోడీ. అనంతరం ప్రధాన మంత్రి తో మాట్లాడిన మహిళా రైతు వన్నూరమ్మను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అభినందించారు.

Read more RELATED
Recommended to you

Latest news