కింగ్ ఎక్కడైనా కింగే.. పాకిస్థాన్‌లో విరాట్ కోహ్లీ క్రేజ్

-

ఇండియన్ క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ప్రపంచంలో ఏ వేదికలో మ్యాచ్ జరిగినా కింగ్ క్రీజ్‌లో ఎంటర్ అయ్యాడంటే కోహ్లీ కోహ్లీ అంటూ నినాదాలు వినిపిస్తాయి. ఇక ఈ సూపర్ స్టార్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను చూస్తే అర్థమవుతుంది అతడికి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో. ఇక ఇండియా – పాకిస్థాన్‌ చిరకాల ప్రత్యర్థులన్న సంగతి తెలిసిందే. అయితే ఆటలో ప్రత్యర్థులైనా కింగ్‌కి ఫ్యాన్స్ ఉన్నారు.

పాకిస్థాన్‌లో కింగ్ కోహ్లీ క్రేజ్ ఏంటో ఓ సంఘటన మరోసారి ప్రూవ్ చేసింది. అదేంటంటే.. బలోచిస్థాన్‌ ప్రావిన్స్‌కు చెందిన ఓ వ్యక్తి.. కోహ్లీపై ఉన్న అభిమానాన్ని ఘనంగా చాటుకున్నాడు. స్వతహాగా సైకత శిల్పి అయిన ఆర్‌ఏ గద్దాని.. తన అభిమానాన్నంతా రంగరించి భారీ స్థాయిలో విరాట్‌ సైకత శిల్పాన్ని అందంగా తీర్చిదిద్దాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పాక్‌ యాక్టివిస్ట్‌ ఫాజిలా బలోచ్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా.. అవి వైరల్‌గా మారాయి. దీన్ని చూసిన ఫ్యాన్స్.. ‘కింగ్ ఎక్కడైనా కింగే’ కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news