”భారత్ పని పడతా”..! భారత్ కు పాక్ ప్రధాని స్ట్రాంగ్ వార్నింగ్…!

-

pakistan prime minister imran khan warns india
pakistan prime minister imran khan warns india

పాకిస్థాన్ కరాచీ లోని స్టాక్ ఎక్స్ ఛేంజ్ భవనం వద్ద నిన్న దుండగులు మూకుమ్మడి దాడులకు పాల్పడ్డారు. భవనాన్ని సమీపించిన నలుగురు దుండగులు తుపాకులతో గ్రనేడ్ లతో దాడికి దిగారు, దాడిలో ఇద్దరు గార్డ్స్ ను ఓ పోలీసు అధికారిని వారు దాడి చేసి హతమార్చారు. వెంటనే రంగంలోకి దిగిన సెక్యూరిటీ దళాలు తిరిగి కాల్పులు జరపగా ఆ దుండగులు అక్కడికక్కడే మరణించారు. దేశం లోని స్టాక్ ఎక్స్ ఛేంజ్ భవనం వద్ద ఇటువంటి ఘటన జరగడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక నేడు ఈ అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ ఘటన వెనుక భారత్ హస్తం ఉందని ఆరోపించారు.

ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటన కచ్చితంగా భారత్ చేతుల మీదిగానే జరిగిందని అందులో ఆయనకు ఎటువంటి అనుమానం లేదని అన్నారు. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం దేశంలో త్వరలో ఏదో అటాక్ జరగబోతుందని తనకు ఆ విషయం ముందుగానే తెలిసిందని ఆయన అన్నారు. ఇంటెలిజెన్స్ అధికారులు రెండు నెలల క్రితమే తనతో అటాక్ కు సంబంధించిన విషయాలు చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు. స్వయంగా తాను కూడా ఈ అంశాన్ని తన కేబినెట్ లోని మంత్రులతో సూచించినట్టుగా అందరినీ అలర్ట్ గా ఉండమని హెచ్చరించినట్టుగా చెబుతున్నారు ఇమ్రాన్ ఖాన్. ఒకవేళ ఈ దాడి వెనుక కచ్చితంగా భారత్ హస్తమే ఉందని రుజువైతే భారత్ కు తగిన సమాధానం ఇస్తానని ఆయన హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news