యాదాద్రిలో నేటి నుంచి పంచ‌కుండాత్మ‌క యాగం

-

యాదాద్రి న‌ర‌సింహ స్వామి ఆల‌యంలో నేటి నుంచి పంచ‌కుండాత్మ‌క యాగం ప్రారంభం కానుంది. ఆల‌య ఉద్ఘాట‌న‌లో భాగంగా నేటి నుంచి పంచకుండాత్మ‌క యాగం చేయ‌నున్నారు. మ‌హా కుంభ సంప్రోక్షణ‌కు సోమ‌వారం అంకురార్ప‌ణ చేశారు. నిన్న అంకురార్ప‌ణ తో యాగాలు మొదలు అయ్యాయి. కాగ నేటి నుంచి ప్రారంభం అయిన పంచ‌కుండాత్మ‌క యాగం.. వారం రోజుల పాటు జ‌ర‌గ‌నుంది. దీనికి కోసం యాదాద్రి ఆలయంలో ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

yadadri-temple

యాగ‌శాల‌లో సోమ‌వార‌మే.. సంప్రోక్షణ చేసి గుండాల‌ను కూడా సిద్ధం చేశారు. కాగ ఈ పంచ‌కుండాత్మ‌క యాగంలో భాగంగా నిరంత‌రం పారాయ‌ణం చేయాల్సి ఉంటుంది. దీని కోసం 108 మంది పారాయ‌ణీకుల‌ను సిద్ధం చేశారు. ఈ యాగం ఈ రోజు ఉద‌యం 9 గంట‌లకు ప్రారంభం కానుంది. కాగ ఈ యాగంతో పాటు ఆల‌యంలో మూల మంత్ర జ‌పాలు, పారాయ‌ణాలు కూడా కొన‌సాగుతాయి. కాగ వారం రోజుల పాటు యాదాద్రి ఆల‌య ప్రాంగణం మొత్తం వేద మంత్రాలతో మార్మోగ‌నుంది.

Read more RELATED
Recommended to you

Latest news