పేపర్ లీకేజీ ఘటన దురదృష్టకరం – బోయినపల్లి వినోద్

-

పేపర్ లీకేజీ ఘటన దురదృష్టకరం అన్నారు తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్. నేడు బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పేపర్ లీకేజీ ఘటనపై రేవంత్ రెడ్డి అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నాడని.. కేటీఆర్ పిఏ ఊర్లో 100 మంది పాస్ అయ్యారని ఆరోపిస్తున్నాడని, సిట్ అధికారులు నోటీసులు ఇస్తే మాత్రం బండి సంజయ్ కానీ, రేవంత్ రెడ్డి కానీ స్పందించడం లేదన్నారు.

ఇటీవల కురిసిన అకాల వర్షం కారణంగా నష్టపోయిన ఒక రైతుని కలిశామని.. వర్షం వల్ల తాను 50 లక్షలు నష్టపోయానని ఆ రైతుతమికి చెప్పారని, వచ్చే సారీ మళ్లీ సేద్యం చేస్తానని, మాకు కెసిఆర్ అండగా ఉన్నాడని ఆ రైతు తమతో చెప్పాడని వివరించారు. తెలంగాణలో రైతులు అన్ని గ్రామాలలో ఇంత ధైర్యంగా ఉన్నారు అంటే అది కేసీఆర్ వల్లే సాధ్యం అయింది అన్నారు. బిజెపి – కాంగ్రెస్ లు కూడా ఈ అభివృద్ధిని కాదనలేరని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news