ఎన్‌కౌంట‌ర్‌పై దిశ త‌ల్లిదండ్రులు ఏం అన్నారంటే…

-

దిశ హత్యాచారం కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు పోలీసులు. గురువారం రాత్రి దిశ హ‌త్య‌చారం జ‌రిగిన స్పాట్లోనే పోలీసుల సీన్ రీ క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌ చేస్తుండ‌గా న‌లుగురు నిందితులు పోలీసుల నుంచి త‌ప్పించుకుని పారిపోయేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ సంఘ‌ట‌న‌లోనే పోలీసులు వెంట‌నే ఆ న‌లుగురు నిందితుల‌ను నిర్దాక్షిణ్యంగా ఎన్‌కౌంట‌ర్ చేసేశారు. న‌లుగురు నిందితులు స్పాట్లోనే మృతిచెందారు.

ఈ ఎన్‌కౌంట‌ర్‌పై దేశ‌వ్యాప్తంగా పార్టీలు, మ‌తాలు, కులాల‌కు అతీతంగా ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ ఎన్‌కౌంట‌ర్‌పై దిశ తల్లిదండ్రులు స్పందించారు. నిందితులకు తగిన శిక్ష పడిందని అన్నారు. త‌మ కుమార్తెపై జ‌రిగిన ఘోరానికి… ఆ దారుణానికి ఇప్పుడు త‌గిన న్యాయం జ‌రిగిందంటూ వారు సంతోషం వ్య‌క్తం చేశారు.

ఇకపై ఏ ఆడ‌పిల్ల‌పై కూడా ఇలాంటి మళ్లీ పునరావృతం జరగకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. ఏదేమైనా దిశ ఇప్పుడు లేక‌పోయి ఉండొచ్చు… అయితే త‌మ బిడ్డ‌లా మ‌రొ ఆడ‌బిడ్డ బ‌లి కాకూడ‌ద‌నే ఆమె త‌ల్లిదండ్రులు ఈ ఎన్‌కౌంట‌ర్‌పై త‌మ స్పంద‌న తెలియ‌జేశారు. దిశ హత్యాచారం కేసులో.. జొల్లు శివ, మహమ్మద్, జొల్లు నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. ఎక్కడైతే.. దిశ మరణించిందో.. అదే ప్రదేశంలో.. పోలీసులు నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news