హిందూ ధర్మం గౌరవించే వారికే ఆధార్‌కార్డు ఇవ్వాలి : పరిపూర్ణానంద స్వామి

-

పరిపూర్ణానంద స్వామి సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. దేశంలో హిందువులకు, హిందూ ధర్మాన్ని గౌరవించే వారికే ఆధార్‌ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జగిత్యాల పట్టణంలో సోమవారం నిర్వహించిన వీరహనుమాన్‌ విజయ యాత్రలో పరిపూర్ణానంద పాల్గొన్నారు.

‘‘హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాల్సిన అవసరముంది. ముఖ్యంగా మన దేశంలో హిందువులుగా జీవించే వారికి, హిందువులు కాకున్నా హిందువులను గౌరవించే వారికి మాత్రమే ఆధార్‌ కార్డులు ఇవ్వాలి. ఇందుకోసం పార్లమెంటు, ఇతర అన్ని స్థాయిల్లో ప్రజా ప్రతినిధులు కృషి చేయాలి. జగిత్యాలకు చెబితే జగమంతా చెప్పినట్లే. ఇక్కడి నుంచే ఈ అంశం దేశవ్యాప్తం కావాలి’ ’అని పరిపూర్ణానంద స్వామి పిలుపునిచ్చారు. విజయ యాత్రలో వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు బోయిని పద్మాకర్‌, నిర్వాహక అధ్యక్షుడు, డాక్టర్‌ వెంకట్రాజ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news