పాపం… తిరుపతి ప్రచారం కోసం వెళ్తే దిక్కు లేదా…?

-

తిరుపతి పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీకి చెందిన యువ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే తిరుపతి పార్లమెంటు పరిధిలో యువ నాయకులను గుర్తించ్చె నాయకత్వం పెద్దగా కనబడటంలేదు. కొంతమంది కీలక నాయకులు యువ నాయకత్వాన్ని పట్టించుకోవడం లేదు. గోదావరి జిల్లాల నుంచి వెళ్ళిన కొంతమంది నాయకులను కూడా పక్కన పెట్టేస్తున్నారు.

అంతేకాకుండా రాయలసీమ జిల్లాల్లో ఇతర ప్రాంతాల నుంచి వెళ్లిన వాళ్లకి కూడా పెద్దగా గుర్తింపు ఉండటం లేదు. మీడియా కూడా పెద్దగా వాళ్ళను హైలెట్ చేయడం లేదు. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా కూడా పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయక పోవడంతో వాళ్ళు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే భావన ఉంది. చాలా మంది నాయకులు చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు.

ఇక చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ ప్రచారం నిర్వహిస్తున్నారు కూడా. అయితే వాళ్లను సీనియర్ నేతలు పక్కన పెడుతున్నారని అంటున్నారు. లోకేష్ కి చంద్రబాబు నాయుడుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో గ్రామీణ ప్రాంతాల్లో పార్టీలో యువ నాయకులు ఇబ్బందులు పడుతున్నారని… గ్రామీణ ప్రాంతాల్లో యువ నాయకత్వం ప్రచారం చేయడానికి వెళ్ళినా సరే అనుకూలంగా లేవు అని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి భవిష్యత్తులో ఎటువంటి వాతావరణం ఉంటుంది అనేది చూడాలి. యువ నాయకులను ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పక్కనపెట్టింది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news