ప్రజారాజ్యం పార్టీకి ద్రోహం చేసిన వాళ్లతోనే పవన్ స్నేహం చేస్తున్నారు – మంత్రి కొట్టు

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసిపి మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజారాజ్యం పార్టీకి ద్రోహం చేసిన వారికి సమాధానం చెబుతానన్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు వాళ్లతోనే కలిసి స్నేహం చేస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబుకు దగ్గరై కాపు సామాజిక వర్గాన్ని కించపరుస్తున్నాడని మండిపడ్డారు. మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.

పవన్ కళ్యాణ్ విచక్షణ కోల్పోయి ఓ ఉన్మాదిలా మాట్లాడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. వంగవీటి రంగను చంద్రబాబు హత్య చేయించారని హరిరామ జోగయ్య తన పుస్తకంలో రాశారని తెలిపారు. రంగ హత్య గురించి పవన్ కళ్యాణ్ వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. ప్రాణహాని ఉందని వంగవీటి రంగా చెప్పినప్పటికీ టిడిపి ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. ఆరోజు ఏం జరిగిందో హోం మంత్రిగా ఉన్న హరిరామ జోగయ్య చెప్పారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news