విశాఖ ఉక్కు ప‌రిర‌క్ష‌ణ… దీక్ష ప్రారంభించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

-

విశాఖ ఉక్కు ప‌రిర‌క్ష‌ణ కోసం త‌ల‌పెట్టిన దీక్ష ను ప్రారంభించారు జ‌న సేన పార్టీ అధినేత‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. మంగ‌ళ గిరి ప‌ట్ట‌నంలోని జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలో… ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ దీక్ష కు కూర్చున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విష‌యం పై ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్పందించాలనే ముఖ్య‌మైన డిమాండ్, కేంద్రం తీరుకు వ్య‌తిరేకంగా ప‌వ‌న్ కళ్యాణ్ దీక్ష కు దిగారు.

త‌మిళ నాడు రాష్ట్రంలో హెలికాప్ట‌ర్ ప్రమాదంలో మ‌ర‌ణించిన‌.. అమ‌ర వీరుల‌కు నివాళులు అర్పించిన అనంత‌రం.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. దీక్ష కు దిగారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్.. దీక్ష ఇవాళ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు జ‌రుగ‌నుంది. ఇక ఈ సంద‌ర్భంగా నాదేండ్ల మ‌నోహ‌ర్ మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ పై సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్పందించాల‌ని డిమాండ్ చేశారు. అలాగే.. రైతు చ‌ట్టాల విష‌యంలో కేంద్రం వెన‌క్కి అడుగు వేసిన త‌ర‌హాలోనే.. విశాఖ స్టీల్ ప్లాంట్ విష‌యంలోనూ.. త‌మ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు నాదెండ్ల మ‌నోహ‌ర్‌.

Read more RELATED
Recommended to you

Latest news