“జనసైనికులు” సమస్యలపై మాట్లాడండి : పవన్ కళ్యాణ్

-

పవన్ కళ్యాణ్ ఎప్పుడూ విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు.. ఈయన ఆలోచన ధీరని ఎవరి ఊహకు అంతుచిక్కదు అన్నదానికి ఈయన కాసేపటి క్రితమే చేసిన వ్యాఖ్యలే సాక్ష్యం అని చెప్పాలి. బ్రో సినిమా వలన పవన్ కు మరియు మంత్రి అంబటి రాంబాబుకు మధ్యన వివాదం నడుస్తోంది. వైసీపీ నుండి ఈ విషయంపై కేవలం అంబటి రాంబాబు మాత్రమే కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. కానీ జనసేన నుండి చూస్తే అందరూ ఈ ఒక్క విషయంపైనే తమ దృష్టిని కేంద్రీకరించారు. ఈ విధానం పట్ల జనసేన అధినేత తన సైనికులనే ప్రశ్నించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈయన మాట్లాడుతూ.. జనసైనికుల్లారా పనికిరాని, ఉపయోగం లేని విషయాల గురించి గంటల గంటల డిబేట్ లు వద్దు.

వైసీపీ నాయకులు ప్రస్తుతం ఏపీలో ఉన్న ప్రధాన సమస్యలు మహిళల అదృశ్యం, పోలవరం, చిన్నారుల ట్రాఫికింగ్ వంటి అంశాలను కప్పిపుచ్చుకోవడానికి డైవర్ట్ చేస్తారు, కానీ జనసైనికులుగా మీరు నిజంగా రాష్ట్రానికి మంచి చేయాలి అనుకుంటే ఈ సమస్యల గురించి మాట్లాడండి.. ప్రజల్లో అవగాహన తీసుకురండి అంటూ సొంత పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు పవన్.

Read more RELATED
Recommended to you

Latest news