ఉప ముఖ్యమంత్రిగా సచివాలయంలో అడుగు పెట్టబోతున్న పవన్ కళ్యాణ్

-

ఉప ముఖ్యమంత్రిగా సచివాలయంలో అడుగు పెట్టబోతున్నారు ఏపీ మంత్రి పవన్ కళ్యాణ్. ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటిసారి సచివాలయానికి రాబోతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు సచివాలయానికి రానున్నారు పవన్ కళ్యాణ్.

Pawan Kalyan is going to step into the Secretariat as Deputy Chief Minister

రెండో బ్లాక్ లోని తన ఛాంబర్ ను పరిశీలించనున్నారు పవన్ కళ్యాణ్. అనంతరం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నారు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారి అమరావతికి వస్తున్న పవన్ కళ్యాణ్ కు మానవహారంతో పూలు చల్లి స్వాగతం తెలుపనున్నారు అమరావతి రైతులు.

Read more RELATED
Recommended to you

Latest news