మిస్టర్ జగన్..నీ ఇడుపులపాయలో హైవే వేస్తా – పవన్ కళ్యాణ్

-

కాసేపటి క్రితమే… ఇప్పటం గ్రామం బయలు దేరారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. దీంతో పోలీసులు భారీగా అక్కడికి చేరుకున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే.. సీఎం జగన్‌ కు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వార్నింగ్‌ ఇచ్చారు. అరెస్టు చేసుకుంటే అరెస్టు చేసుకోనివ్వండని ఛాలెంజ్‌ చేశారు.

మిస్టర్ జగన్..నీ ఇడుపులపాయలో హైవే వేస్తానంటూ హెచ్చరించారు పవన్ కళ్యాణ్. జనసేన సభకు స్థలమిచ్చినందుకే ప్రభుత్వం… ఇళ్లను కూలగొట్టిందని ఆగ్రహించారు. మార్చిలో మా సభకు భూమి ఇస్తే… ఏప్రిల్‌ లో ఇళ్లను కూల్చేస్తామని నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు. గుంతలు పూడ్చలేరు, రోడ్లు వేయలేరు, కానీ రోడ్డు విస్తరణ కావాలా అని నిలదీశారు పవన్‌ కళ్యాణ్‌. పోలీసులు… రేపిస్టులు, ప్రభుత్వానికి కొమ్ముగాస్తున్నారని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news