పవన్ కళ్యాణ్ ని అనవసరంగా కెలికి తిట్లు తిన్నారు – ఎంపీ రఘురామ

-

వైసిపి నేతలు పవన్ కళ్యాణ్ ను అనవసరంగా కెలికి మరి ఆయనతో తిట్లు తిన్నారని అన్నారు వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. గదిలో పెట్టి పిల్లిని కొడితేనే కళ్ళు పీకుతుందని.. అదే పులిని కొడితే ఏమవుతుంది? అంటూ ఓ సామెతను ప్రస్తావిస్తూ వైసిపి నేతలపై ఎంపీ రఘురామకృష్ణ రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ విషయంలో వైసిపి అదే చేసిందని ఆయన విమర్శించారు. వరుస పెట్టి విమర్శిస్తుంటే ఎవరికైనా కోపం వస్తుందని.. పవన్ కళ్యాణ్ కూడా మనిషే అని చెప్పుకొచ్చారు.

మూడు పెళ్లిళ్లు అనేది పవన్ కళ్యాణ్ వ్యక్తిగతమని అన్నారు. పవన్ కళ్యాణ్ చేసుకున్న మూడు పెళ్లిళ్ల గురించి విమర్శిస్తున్న వైసిపి నేతలు తమ పార్టీ అధినేత ఇంటిలో జరిగిన పెళ్లిళ్లపై ఎందుకు ప్రశ్నించారని అన్నారు. జగన్ ముత్తాత వెంకటరెడ్డి తొలి భార్య బతికుండగానే ఆమెకు విడాకులు ఇవ్వకుండానే మరో మహిళలని వివాహం చేసుకున్నారని, అలాగే జగన్ సోదరి వైయస్ షర్మిల కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news