కుట్రలు కుతంత్రాలు, ద్రోహ చింతన విడనాడాలి – పవన్ కళ్యాణ్-

-

క్రిస్మస్ పండుగ నేపథ్యంలో తెలుగు ప్రజలకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. లోకభాంధవుడుగా కీర్తిగాంచిన ఏసుక్రీస్తు అవతరించిన పవిత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ పండుగ జరుపుకొంటున్న క్రైస్తవ సోదర సోదరీమణులకు ప్రేమ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు పవన్ కళ్యాణ్.

 

పశువులపాకలో జన్మించి, గొర్రెల కాపరిగా జీవించి ప్రపంచానికి త్యాగం.. శాంతి.. ప్రేమ సందేశాలను ఆచరణాత్మకంగా అందించిన ఆ ప్రభువు పలుకులు సర్వదా ఆచరణీయం. ‘ఈర్ష్యాద్వేషాలు, కుట్రలు కుతంత్రాలు, ద్రోహ చింతన విడనాడాలి’ అన్న క్రీస్తు వ్యాక్యము శ్రేయోదాయకమన్నారు పవన్.

 

అబద్దం, లంచం, లోభానికి పాల్పడనివారే నిజమైన క్రీస్తు భక్తులు అని చెప్పిన బైబిల్ సారాన్ని విశ్వసిస్తాను. ఈ ఆనందపు వేళ ప్రజలందరికీ అంతులేని ఆనందాన్ని, సంపదను ప్రసాదించాలని ఏసు క్రీస్తును ప్రార్ధిస్తున్నానని వెల్లడించారు పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news