ప్రధాని నరేంద్ర మోడీకి పవన్ కళ్యాణ్ లేఖ

-

ఆంధ్రప్రదేశ్ లో ఇండ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని.. దీనిపై సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఇవాళ పవన్ కళ్యాణ్  ప్రధాని నరేంద్ర మోడీకి 5 పేజీలు లేఖ రాశారు. వైసీపీ పాలనలో భూ సేకరణ పేరిట రూ.32,141 కోట్ల నిధులు దుర్వినియోగం చేశారని తెలిపారు.

ఇళ్ల పట్టాలు, నిర్మాణం పై ప్రభుత్వం భిన్న ప్రకటనలు చేస్తోంది. సీబీఐ వంటి సంస్థలతో దర్యాప్తు చేయిస్తే వాస్తవాలు తెలుస్తాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు భూ సేకరణలో కీలకంగా వ్యవహరించారు. గతంలో నిర్మించిన టిడ్కో ఇండ్లను కూడా పూర్తిగా లబ్దిదారులకు ఇవ్వలేదన్నారు. 6.68 లక్షల టిడ్కో ఇండ్లు పూర్తి అయితే 86, 984 మందికే ఇచ్చారు అని పవన్ కళ్యాణ్ తన లేఖలో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news