అమితాబ్ కు కరోనాపై పవన్ ట్వీట్…!

-

భారత దిగ్గజ నటుడు, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కరోనా బారిన పడటం పై ఇప్పుడు సినీ ప్రపంచం మొత్తం కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఆయన కరోనా బారి నుంచి త్వరగా బయటపడాలని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు చేస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు.

నా ప్రియమైన, గౌరవనీయలైన అమితాబ్ బచ్చన్‌కి అంటూ… గతంలో ఆయన గాయపడిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. నా తల్లి, తండ్రితో సహా కుటుంబం మొత్తం మీ శ్రేయస్సు కోసం ప్రార్థించిన ఆనాటి సమయం తాను ఇప్పటికీ గుర్తుంచుకున్నానని ఆయన పేర్కొన్నారు. మీరు కూలీ షూటింగ్ సమయంలో గాయపడితే ప్రతీ ఒక్కరు మీ క్షేమాన్ని కోరుకున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు.

తాము మిమ్మల్ని సదా ప్రేమిస్తూనే ఉంటామని పవన్ చెప్పుకొచ్చారు. కేవలం మీ ప్రతిభనే కాకుండా మీ పోరాట స్ఫూర్తి, సరళత, వినయాన్ని కూడా తాము ఎంతగానో ఇష్టపడతాం అంటూ పవన్ పోస్ట్ చేసారు. మీరు, అభిషేక్ కరోనా బారిన పడ్డారు అని తెలిసి బాధ కలిగిందని ఆవేదన వ్యక్తం చేసారు. ధన్వంత్రి మాత మిమ్మల్ని అభిషేక్‌ని శక్తిమంతుల్ని చేయాలని, మీరిద్దరినీ మంచి ఆరోగ్యంతో చూడాలని ఎదురుచూస్తున్నామన్నారు పవన్.

Read more RELATED
Recommended to you

Latest news