వైసీపీ నాయకులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్.. చెప్పు తీసుకుని పళ్లు రాలగొడతా..!

-

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మంగళ గిరిలో సమావేశం నిర్వహించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. వైసీపీ నేతలను పచ్చి బూతులు తిట్టారు.

ఇంకోసారి తాను ప్యాకేజీ తీసుకున్నానని ఎవడైనా అంటే చెప్పు తీసుకుని పళ్లు రాలగొడతానని హెచ్చరించారు. గత 8 ఏళ్ల కాలంలో ఆరు సినిమాలు చేశానని… రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్లు సంపాదించా.. రూ.33.37 కోట్లు ట్యాక్స్ కట్టానని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్.

వెధవలు.. సన్నాసులు.. కొడకల్లారా అంటూ వైసీపీ నేతలపై పవన్ కళ్యాణ్‌ తీవ్ర విమర్శలు చేశారు. నేను విడాకులు ఇచ్చి మూడు పెళ్లిళ్లు చేసుకున్నా.. ఒక్క పెళ్లి చేసుకుని 30 మంది స్టెపినీలతో తిరిగే మీరు నాకు చెప్పేదేంటి ? అని నిలదీశారు పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news