దగ్గుబాటి పురందేశ్వరికి పవన్ శుభాకాంక్షలు…

-

ఆంద్రప్రదేశ్ రాజకీయాలలో ఏమంత ప్రాధాన్యం లేని పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. తాజాగా బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకుని కొందరికి షాక్ ఇచ్చింది అని చెప్పాలి. అందులో భాగంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉదయం వరకు కొనసాగిన సోము వీర్రాజు ను అర్ధాంతరముగా తొలగించి ఆ బాధ్యతలను బీజేపీ మహిళా ఎంత దగ్గుబాటి పురేందేశ్వరికి అప్పగించింది. అయితే ఏపీలో ఏమంత ప్రభావవంతంగా పార్టీని ముందుకు నడిపించడంలో సక్సెస్ కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక పురందేశ్వరికి గతంలో కేంద్రమంత్రిగా చేసిన అనుభవంగా కూడా ఉండడంతో ఆమెపై బలమైన నమ్మకంతో ఈ బాధ్యతను ఇచ్చారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

కొత్తగా వచ్చిన పదవిని పురందేశ్వరి బాధ్యతతో ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నా అంటూ చెప్పారు. మరి ఏమైనా ఏపీలో పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సక్సెస్ అవుతారా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news