కుప్పంలోనూ చంద్రబాబు జెండా పీకేస్తాం: మంత్రి పెద్దిరెడ్డి

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. పుంగనూరులో టిడిపి నేతలు అరాచకాలు చేస్తే, చూస్తూ సహించాలా? అని ప్రశ్నించారు. తనను చంద్రబాబునాయుడు హెచ్చరించడం హాస్యాస్పదం అన్నారు. కాంగ్రెస్ హయాం నుంచి చిత్తూరు జిల్లాలో టిడిపి మెజార్టీ సాధించలేదని గుర్తు చేశారు.

ఈ సారి కుప్పంలోను చంద్రబాబు జెండాను పీకేస్తామని స్పష్టం చేశారు. కులాన్ని అడ్డుపెట్టుకుని పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు, ఆ కులానికి సంబంధించిన వంగవీటి రంగా ను చంపించింది చంద్రబాబు కాదా? అని నిలదీశారు. భోగి మంటల్లో కాల్చాల్సింది జీఓ నెం.1 ని కాదు, సీఎం కావాలనే తాపత్రయాన్ని కాల్చుకోవాలి.. కేఏ పాల్ లాగా చంద్ర బాబు కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీనే గెలుస్తుందని స్పష్టం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news