రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలు గమనిస్తున్నారు – మంత్రి పెద్దిరెడ్డి

-

అనంతపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షుల పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయనతోపాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి ఉషశ్రీ చరణ్, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు పార్టీ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సిఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మిమ్మల్ని గుర్తించి, బాధ్యతలు అప్పగించారని.. మీరు బాధ్యత తీసుకుని పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల విజయం కోసం కృషి చేయాలన్నారు. 13 న జరిగే ఈ ఎన్నికల్లో మంచి మెజారిటీతో అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మనం పార్టీ కోసం శ్రమిస్తే, మన కోసం సిఎం వైఎస్ జగన్ మరింత కృషి చేస్తారని పేర్కొన్నారు. అందరూ వారివారి సంఘాల్లో సమన్వయంతో పని చేయాలన్నారు పెద్దిరెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. సామాన్య ప్రజలు, ఉద్యోగులు అంతా వైసిపి కి మద్దతుగా నిలుస్తారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news