కేబినేట్ లోకి పిన్నెల్లి, విడదల…!

-

ఆంధ్రప్రదేశ్ లో కేబినేట్ విస్తరణ ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా, ప్రధాన మీడియా వేదికగా దీనిపై ప్రచారం ఎక్కువగా చర్చలు ఊపందుకున్నాయి. ఇటీవల ఇద్దరు మంత్రులు, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇద్దరూ కూడా రాజ్యసభ అభ్యర్ధులుగా నామినేషన్ దాఖలు చేసారు. వాళ్లకు జగన్ రాజ్యసభ సీట్లు ఇవ్వడంతో త్వరలోనే మంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు.

దీనితో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కేబినేట్ విస్తరణ చెయ్యాలని జగన్ భావిస్తున్నారు అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఈ నేపధ్యంలో ఆయన కేబినేట్ లోకి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మాచర్ల నుంచి ఇప్పటి వరకు ఒక్కరు కూడా మంత్రి కాలేదు. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అక్కడి నుంచి నాలుగు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

అలాగే జగన్ కోసం ఆయన కాంగ్రెస్ లో ఎమ్మెల్యే పదవి కూడా వదులుకున్నారు. ముందు నుంచి ఆయన జగన్ కు విధేయుడు గానే ఉన్నారు. అనుకోని కారణాలతో ఆయనకు కేబినేట్ బెర్త్ దూరమైంది. జగన్ ప్రభుత్వ విప్ పదవి తో సరిపెట్టారు. ఇక ఇప్పుడు ఆయన కేబినేట్ లోకి రావడానికి సిద్దమవుతున్నారు. మాచర్ల నియోజకవర్గంలో ఎక్కువ స్థానాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవం చేస్తే,

జగన్ దగ్గర బెస్ట్ మార్కులు కొట్టేయవచ్చు అని భావించిన పిన్నెల్లి ఆ విధంగా ప్రయత్నాలు చేసారు. తమ్ముడు తో కలిసి మాచర్ల నియోజకవర్గంలో గట్టి వ్యూహాలతో ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇక చిలకలూరి పేట నుంచి విజయం సాధించిన విడదల రజనీ, ఇప్పుడు కేబినేట్ లోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె ఆర్ధికంగా బలంగా ఉన్న నేత కావడంతో జగన్ కేబినేట్ లో చోటు కల్పించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news